భూకంపానికి వణికిన బీహార్... భయంతో జనం పరుగులు!

ABN , First Publish Date - 2020-09-16T16:48:20+05:30 IST

బీహార్‌లోని పట్నాతో పాటు పలు జిల్లాలలో భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టార్ స్కేలుపై భూకంప తీవ్రత 5.3గా నమోదయ్యింది. కాఠ్మాండుకు సమీపంలోని సింధుపాల్చోక్ జిల్లాలోని రామ్చె కేంద్రంగా భూకంపం...

భూకంపానికి వణికిన బీహార్... భయంతో జనం పరుగులు!

పట్నా: బీహార్‌లోని పట్నాతో పాటు పలు జిల్లాలలో భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టార్ స్కేలుపై భూకంప తీవ్రత 5.3గా నమోదయ్యింది. నేపాల్‌లోని కాఠ్మాండుకు సమీపంలోని సింధుపాల్చోక్ జిల్లాలోని రామ్చె కేంద్రంగా భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. బీహార్‌లోనూ భూ ప్రకంపనలు సంభవించాయి.  



పూర్వీ, పశ్చిమ చంపారణ్, సారణ్, గోపాల్‌గంజ్, సీతామడి, శివహర్, సమస్తీపూర్, సుపౌల్, సహరసా, మథెపురా, దర్బంగా, ముజఫ్ఫర్‌పురా, పట్నా తదితర జిల్లాల్లో భూ ప్రకంపనలు కనిపించాయి. ఉదయాన్నే చోటుచేసుకున్న ఈ భూకంపానికి ప్రజలు బీతిల్లి, ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా ఈ భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్టు సమచారమేదీ అందలేదు.  

Updated Date - 2020-09-16T16:48:20+05:30 IST