నిషేధిత జాబితాకు ఎక్కని పాక్ ఉగ్ర నేతలు: ఐరాస
ABN , First Publish Date - 2020-07-27T07:23:35+05:30 IST
పాకిస్థానీల సారథ్యంలోని పలు ఉగ్రవాద సంస్థలు ఇప్పటికీ నిషేధిత జాబితాకు ఎక్కలేదని

ఐక్యరాజ్యసమితి, జూలై 26 : పాకిస్థానీల సారథ్యంలోని పలు ఉగ్రవాద సంస్థలు ఇప్పటికీ నిషేధిత జాబితాకు ఎక్కలేదని ఐక్యరాజ్యసమితి నివేదించింది. భారత ఉపఖండంలో అల్కాయిదా, ఇరాక్లో ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) తో పాటు తెహ్రీక్-ఏ-తాలిబన్ పాకిస్థాన్ తదితర ఉగ్ర సంస్థలకు పాకిస్థానీలే సారథ్యం వహిస్తున్నారు. ఐఎ్స-కె సారథి అస్లామ్ ఫరూకీ, అంతకు ముందు ఆ సంస్థను నడిపించిన జియా వుల్ హక్ పాకిస్థాన్ దేశస్థులే. వీరి పేర్లను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి బ్లాక్లి్స్టలో ఇప్పటికీ చేర్చలేదు. భారత ఉపఖండంలో అల్కాయిదా బాధ్యతలు చూస్తున్న ఒసామా మహమూద్ పేరు కూడా నిషేధిత జాబితాలో లేదని ఐరాస నివేదించింది.