అయ్యయ్యో.. కరోనా రోగితో ప్రభుత్వాధికారుల సెల్ఫీ!

ABN , First Publish Date - 2020-03-25T04:24:44+05:30 IST

పాకిస్థాన్‌లో అస్సలు నమ్మశక్యంకానీ ఓ ఘటన చోటుచేసుకుంది. ఓ ఐదుగురు ప్రభుత్వాధికారులు పాక్ పరువు మంట కలిసేలా చేశారు. ప్రజలకు మార్గ నిర్దేశం చేయాల్సిన పదవుల్లో ఉండి కూడా కరోనా‌తో కామెడీలాడారు. సహోద్యోగికి కరోనా వచ్చిందని తెలిసి కూడా అతడితో సెల్ఫీ దిగారు.

అయ్యయ్యో.. కరోనా రోగితో ప్రభుత్వాధికారుల సెల్ఫీ!

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో అస్సలు నమ్మశక్యంకానీ ఓ ఘటన చోటుచేసుకుంది. ఓ ఐదుగురు ప్రభుత్వాధికారులు పాక్ పరువు మంట కలిసేలా చేశారు. ప్రజలకు మార్గ నిర్దేశం చేయాల్సిన పదవుల్లో ఉండి కూడా కరోనా‌తో కామెడీలాడారు. సహోద్యోగికి కరోనా వచ్చిందని తెలిసి కూడా అతడితో సెల్ఫీ దిగారు. అక్కడితో ఆగక ఆ ఫోటోను సోషల్ మీడియాలో పెట్టేశారు. విషయం తెలిసిన ప్రభుత్వం.. వారందరినీ క్వారంటైన్ చేయడంతో పాటూ ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేసేసింది. ఖైర్‌పూర్ గ్రామంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సదరు కరోనా బాధితుడు ఇరాన్ ‌ను తిరిగొచ్చిన సందర్భంగా అతడింటికి వెళ్లిన ఈ ఐదుగురు ఇటువంటి చర్యకు పూనుకున్నారు. 


Updated Date - 2020-03-25T04:24:44+05:30 IST