ఏడేళ్ల వయసులోనే పుస్తకం రాసిన అభిజిత
ABN , First Publish Date - 2020-09-21T08:33:41+05:30 IST
ఉత్తరప్రదేశ్కు చెందిన అభిజిత ఏడేళ్ల వయసులోనే రచయిత్రిగా మారింది. ఆలోచనలకు అక్షర రూపమిచ్చి.. ఆసక్తికి సాహితీ పరిమళం అద్ది.. చిట్టి చేతులతో పద్యాలు, కథలు రాసి.. ’హ్యాపీనెస్ ఆల్ ఎరౌండ్’శీర్షికన ఓ పుస్తకాన్ని రచించింది...
- మైథిలీశరణ్ గుప్త్ ముని మనవరాలి ప్రతిభ
న్యూఢిల్లీ, సెప్టెంబరు 20 : ఉత్తరప్రదేశ్కు చెందిన అభిజిత ఏడేళ్ల వయసులోనే రచయిత్రిగా మారింది. ఆలోచనలకు అక్షర రూపమిచ్చి.. ఆసక్తికి సాహితీ పరిమళం అద్ది.. చిట్టి చేతులతో పద్యాలు, కథలు రాసి.. ’హ్యాపీనెస్ ఆల్ ఎరౌండ్’శీర్షికన ఓ పుస్తకాన్ని రచించింది. దాన్ని ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ జూనియర్, ఇన్విన్సిబుల్ పబ్లిషర్స్ సంయుక్తంగా విడుదల చేశాయి. రచనా వ్యాసంగంతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్న ఈ చిన్నారి మరెవరో కాదు.. రాష్ట్ర కవి మైథిలీశరణ్ గుప్త్, సంత్కవి సియారామ్శరణ్ గుప్త్ల ముని మనవరాలు. ఐదేళ్ల వయసులోనే కథలు రాయడం మొదలుపెట్టిన అభిజితప్రస్తుతం.. రెండో తరగతి చదువుతోంది. సాహితీపిపాస కుటుంబంలో మూడోతరం రచయిత్రిగా బాల్యం నుంచే బాటలు వేసుకుంటోంది.