షిర్డీ సాయికి 10 రోజుల్లో 3.9 కోట్ల విరాళాలు
ABN , First Publish Date - 2020-11-26T01:52:32+05:30 IST
మహారాష్ట్రలో ఆలయాలు తిరిగి తెరుచుకోవడంతో గత పది రోజుల్లో లక్ష మందికి పైగా భక్తులు ..

ముంబై: మహారాష్ట్రలో ఆలయాలు తిరిగి తెరుచుకోవడంతో గత పది రోజుల్లో లక్ష మందికి పైగా భక్తులు షిర్డీ సాయినాథుని దర్శించుకున్నారు. 3.09 కోట్ల రూపాయలు విలువచేసే కానుకలు, నగదు విరాళాలుగా సమర్పించుకున్నారు. వీటితో పాటు రూ.2,85,629 విలువచేసే 64 గ్రాముల బంగారం, రూ.93,000 విలువచేసే వెండి సమర్పించుకుననట్టు షిర్డీ సాయి సంస్థానం ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో లాక్డౌన్ మొదలైన తర్వాత మూతపడిన షిర్డీ సాయి ఆలయం ఉద్ధవ్ థాకరే ప్రభుత్వ అనుమతితో తిరిగి ఈనెల 16న తెరుచుకుంది. కోవిడ్ ఆంక్షల నేపథ్యలో సాయిబాబా హారతి, దర్శనం, వసతి పరిమిత సంఖ్యలోనే అనుమతిస్తున్నట్టు సంస్థానం ఒక ప్రకటనలో తెలిపింది. దర్శనానికి ఆన్లైన్లో అప్లయ్ చేసుకోవడం కానీ, షిర్డీలోని కౌంటర్ నుంచి టోకెన్ తీసుకోవడం కానీ చేయాలని సూచించింది.