15.97 లక్షలకు 14.37 లక్షల మంది హాజరయ్యారు: నీట్పై కేంద్ర మంత్రి
ABN , First Publish Date - 2020-09-15T01:28:08+05:30 IST
నీట్-జీఈఈ రద్దు చేయాలని దేశవ్యాప్తంగా అనేక మంది డిమాండ్ చేస్తున్నాం. సోషల్ మీడియాలో సైతం నీట్ నిర్వహణపై అనేక వ్యతిరేకత వచ్చింది. కరోనా సమయంలో పరీక్షలు నిర్వహించి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని
న్యూఢిల్లీ: నీట్కు అప్లై చేసుకున్న మొత్తం 15.97 లక్షల మంది అభ్యర్థుల్లో 14.37 అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోక్రియాల్ నిషాంక్ స్పష్టం చేశారు. కొంత మంది కావాలనే నీట్పై అనవసరపు అనుమానాలు లేవనెత్తుతున్నారని, అవన్నీ అవాస్తవమని ఆయన అన్నారు. అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పరీక్షకు హాజరయ్యారయని, విమర్శలు చేసేవారు గణాంకాలు చూసుకోవాలని ఆయన సూచించారు.
నీట్-జీఈఈ రద్దు చేయాలని దేశవ్యాప్తంగా అనేక మంది డిమాండ్ చేస్తున్నాం. సోషల్ మీడియాలో సైతం నీట్ నిర్వహణపై అనేక వ్యతిరేకత వచ్చింది. కరోనా సమయంలో పరీక్షలు నిర్వహించి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని ప్రతిపక్షాలు సైతం నిరసన వ్యక్తం చేశాయి. అయితే ఇదంతా ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారంగా కేంద్ర ప్రభుత్వం చెప్పుకొస్తుంది. నీట్ అభ్యర్థులు కాకుండా ఇతరులే వ్యతిరేకిస్తున్నారని, అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పరీక్షకు హాజరయ్యారని కేంద్ర మంత్రి రమేష్ పోక్రియల్ అన్నారు.