వృద్ధులకు సకాలంలో పెన్షన్‌ చెల్లించాలి

ABN , First Publish Date - 2020-08-05T08:02:02+05:30 IST

వృద్ధులకు పెన్షన్లను సకాలంలో కచ్చితంగా చెల్లించాలని సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. కొవిడ్‌ వ్యాప్తి చెందిన నేపథ్యంలో

వృద్ధులకు సకాలంలో పెన్షన్‌ చెల్లించాలి

  • వృద్ధాశ్రమాల్లో  పీపీఈ కిట్లు, శానిటైజర్లు ఇవ్వాలి: సుప్రీం ఆదేశాలు

న్యూఢిల్లీ, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): వృద్ధులకు పెన్షన్లను సకాలంలో కచ్చితంగా చెల్లించాలని సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. కొవిడ్‌ వ్యాప్తి చెందిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా వృద్ధాశ్రమాలలో ఉండేవారికి  పీపీఈ కిట్లు, శానిటైజర్లు, మాస్కులు అందించాల్సిందిగా కోర్టు స్పష్టం చేసింది. న్యాయమూర్తి జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. కాంగ్రె్‌సకు చెందిన కేంద్ర మాజీ మంత్రి, సీనియర్‌ న్యాయవాది అశ్వినీ కుమార్‌ ఈ వ్యాజ్యం దాఖలు చేశారు.

Updated Date - 2020-08-05T08:02:02+05:30 IST