కరోనా దారుణం: న్యూస్ పేపర్ల నిండా అవే ప్రకటనలు..

ABN , First Publish Date - 2020-03-17T00:20:39+05:30 IST

న్యూస్ పేపర్‌లో ఏకంగా 10 పేజీల్లో సంతాప ప్రకటనలు రావడం ఇటలీలోని పరిస్థితికి అద్దం పడుతోంది.

కరోనా దారుణం: న్యూస్ పేపర్ల నిండా అవే ప్రకటనలు..

న్యూఢిల్లీ: కరోనా వైరస్ ఇటలీలో కరాళ నృత్యం చేస్తోంది. ఒక్క ఆదివారం నాడే కరోనా కారణంగా ఇటలీలో 368 మంది మరణించినట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. కరోనా కారణంగా ఆ దేశం ఎంతగా అల్లాడుతోందో ఈ లెక్కలను చూస్తే తెలుస్తుంది.  అయితే కరోనా వైరస్ ఇటలీపై ఇంతటి ప్రభావం చూపించడానికి ఆ దేశ జనాభాలోని కొన్ని లక్షణాలే కారణమని చెప్పకతప్పదు. ఆ దేశ జనాభాలో 25 శాతం మంది వృద్ధులు కాగా.. 60 శాతం మంది 40 ఏళ్లకు పైబడిన వారు కావడంతో అక్కడ కరోనా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనాకు బలైన వారి సంతాప ప్రకటనలతో న్యూస్ పేపర్లన్నీ నిండిపోతున్నాయి. ఓ పేపర్‌లో ఏకంగా 10 పేజీల్లో ఈ ప్రకటనలు రావడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. 


Updated Date - 2020-03-17T00:20:39+05:30 IST