ఎయిర్ ఇండియాలో ప్రవాస భారతీయులకు ఇక 100 శాతం వాటా
ABN , First Publish Date - 2020-03-05T00:19:53+05:30 IST
కేంద్ర ప్రభుత్వం ఎయిర్ ఇండియా విమాన సంస్థని విక్రయించేందుకు గత కొద్ది కాలంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రవాస భారతీయులకు ఎయిర్ ఇండియాలో వంద శాతం...
![ఎయిర్ ఇండియాలో ప్రవాస భారతీయులకు ఇక 100 శాతం వాటా](https://media.andhrajyothy.com/appimg/galleries/2020030406465060/03042020185224n18.jpg)
కేంద్ర ప్రభుత్వం ఎయిర్ ఇండియా విమాన సంస్థని విక్రయించేందుకు గత కొద్ది కాలంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రవాస భారతీయులకు ఎయిర్ ఇండియాలో వంద శాతం వాటాను విక్రయించేందుకు ప్రభుత్వం అనుమతించిందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు.
ఇంతకుముందు ప్రవాస భారతీయులు ఒక ప్రభుత్వ ఎయిర్లైన్స్ సంస్థలో 49 శాతం వాటా మాత్రమే కొనుగోలు చేయగలరు. ప్రస్తుతం ప్రభుత్వ అనుమతితో ఎఫ్డిఐ ద్వారా కూడా 49 శాతం వాటా విక్రయించే వీలుంది.