ప్రవాసుల వీసా సమస్యపై నిర్ణయం

ABN , First Publish Date - 2020-05-19T08:48:20+05:30 IST

భారత్‌లో లాక్‌డౌన్‌ నేపథ్యంలో తాత్కాలికంగా నిలుపుదల చేసిన ప్రవాసుల వీసాలపై త్వరలో తగిన నిర్ణయం తీసుకుంటామని విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్‌ తెలిపారు. భారత్‌ తీసుకున్న వీసాల నిలుపుదల నిర్ణయంతో...

ప్రవాసుల వీసా సమస్యపై నిర్ణయం

  • కేంద్ర సహాయ మంత్రి వి.మురళీధరన్‌

వాషింగ్టన్‌, మే 18: భారత్‌లో లాక్‌డౌన్‌ నేపథ్యంలో తాత్కాలికంగా నిలుపుదల చేసిన ప్రవాసుల వీసాలపై త్వరలో తగిన నిర్ణయం తీసుకుంటామని విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్‌ తెలిపారు. భారత్‌ తీసుకున్న వీసాల నిలుపుదల నిర్ణయంతో ఓవర్సిస్‌ సిటిజన్‌షిప్‌ ఆఫ్‌ ఇండియా (ఓసీఐ) కార్డుదారులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ప్రవాసులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఈ సమస్య గురించి ప్రధాని మోదీకి తెలుసని, మంచి నిర్ణయం తీసు కుంటారన్నారు. కాగా, భారత్‌లో తాజాగా ఆర్థిక సంస్కణల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసిందని, వాటిని వినియోగించుకుని ప్రవాసులు పెట్టుబడులు పెట్టాలని ఆయన కోరారు. 


Updated Date - 2020-05-19T08:48:20+05:30 IST