ఇక పార్లమెంట్లో ఘర్షణ!
ABN , First Publish Date - 2020-03-02T08:54:39+05:30 IST
బడ్జెట్ సమావేశాల విరామం తరువాత పార్లమెంటు మళ్లీ సోమవారంనుంచి ప్రారంభమవుతోంది. ఢిల్లీ మత ఘర్షణలను ఈ సమావేశాల్లో లేవనెత్తాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. ‘పోలీసులు ఉద్దేశపూర్వకంగానే...

- నేటి నుంచి మళ్లీ సమావేశాలు
- షా రాజీనామాకు కాంగ్రెస్ పట్టు..!
- ఢిల్లీ అల్లర్లను లేవనెత్తాలని నిర్ణయం
న్యూఢిల్లీ, మార్చి 1: బడ్జెట్ సమావేశాల విరామం తరువాత పార్లమెంటు మళ్లీ సోమవారంనుంచి ప్రారంభమవుతోంది. ఢిల్లీ మత ఘర్షణలను ఈ సమావేశాల్లో లేవనెత్తాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. ‘పోలీసులు ఉద్దేశపూర్వకంగానే నిష్ర్కియగా వ్యవహరించారు. ఇది ఖచ్చితంగా హోం శాఖ పనే! ఈ శాఖ కిందే ఢిల్లీ శాంతి భద్రతల వ్యవహారాలున్నాయి. అమిత్ షా రాజీనామా చెయ్యాలని ఇప్పటికే సోనియాగాంధీ డిమాండ్ చేశారు. మేం ఊరుకోం.
ఇందుకు ఉభయసభల్లో పట్టుబడతాం’’ అని పార్టీ విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సోమవారం ఉదయమే కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇస్తుందని వెల్లడించాయి. దీనిని ఎదుర్కొనేందుకు బీజేపీ కూడా సన్నద్ధమవుతోంది. కాగా సీఏఏ వల్ల మైనారిటీలెవరిపైనా ప్రభావం పడబోదని అమిత్ షా కోల్కతా సభలో చేసిన వ్యాఖ్యపై మాజీ హోంమంత్రి చిదంబరం మండిపడ్డారు. ‘సీఏఏ వల్ల మైనారిటీలెవరిపైనా ప్రభా వం పడకపోతే మరెవరిపై పడుతుంది? అసలీ చట్టం ఎందుకు చేశారు?’ అని ప్రశ్నించారు.