లాక్‌డౌన్ సందర్భంగా ఆహారధాన్యాల కొరత లేదు...

ABN , First Publish Date - 2020-04-05T11:07:36+05:30 IST

కరోనా లాక్‌డౌన్ సందర్భంగా దేశంలో ఆహార ధాన్యాల కొరత లేదని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ వెల్లడించారు.....

లాక్‌డౌన్ సందర్భంగా ఆహారధాన్యాల కొరత లేదు...

కేంద్రమంత్రి వెల్లడి

న్యూఢిల్లీ : కరోనా లాక్‌డౌన్ సందర్భంగా దేశంలో ఆహార ధాన్యాల కొరత లేదని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ వెల్లడించారు. దేశంలో ప్రజలకు కావాల్సిన ఆహారధాన్యాల నిల్వలు ఉన్నాయని, వీటిని భారత ఆహార సంస్థ గోదాముల నుంచి రైళ్ల ద్వార దేశంలోని అన్ని ప్రాంతాలకు పంపిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. దేశంలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతుందనే భయం అక్కర లేదని మంత్రి వివరించారు. ‘‘దేశంలోని భారత ఆహార సంస్థ గోదాముల్లో ఏప్రిల్ 1వతేదీ నాటికి ఆహారధాన్యాల నిల్వలు పుష్కలంగా ఉన్నాయి, 365 టన్నుల బియ్యం, 259 టన్నుల గోధుమలను రైళ్ల ద్వార ప్రజలకు పంపిణీ చేసేందుకు పంపిస్తున్నాం’’ అని మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ చెప్పారు. లాక్ డౌన్ సమయంలోనూ భారత ఆహార సంస్థ కార్మికులు, రైల్వే ఉద్యోగులు ఆహార ధాన్యాలను రవాణాకు సహకరిస్తున్నారని మంత్రి చెప్పారు. 

Updated Date - 2020-04-05T11:07:36+05:30 IST