మహారాష్ట్ర డీజీపీకి ఎన్హెచ్ఆర్సీ నోటీసు
ABN , First Publish Date - 2020-04-22T01:16:11+05:30 IST
కాగా ఈ సంఘటనను మతాల కోణంలో చూడవద్దని ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే ఇప్పటికే చెప్పారు. దాడి చేసిన వారు దాడిలో ప్రాణాలు కోల్పోయినవారు ఒకే వర్గానికి చెందిన వారని, కొందరు కావాలనే మత విద్వేషాలు

న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని పల్ఘర్లో జరిగిన సంఘటనపై మహారాష్ట్ర పోలీసు బాస్కు జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ) నోటీసు పంపించింది. నాలుగు వారాల్లో ఈ సంఘటనకు సంబంధించి పూర్తి నివేదిక తమకు తెలియజేయాలని డీజీపీకి పంపిన నోటీసులో ఎన్హెచ్ఆర్సీ పేర్కొంది. పల్ఘర్లో జరిగిన సంఘటన ప్రభుత్వ అధికారుల వైఫల్యాన్ని ఎత్తి చూపుతోందని అభిప్రాయపడ్డ ఎన్హెచ్ఆర్సీ.. మహా ప్రభుత్వంపై మాత్రం స్పందించలేదు.
కాగా ఈ సంఘటనను మతాల కోణంలో చూడవద్దని ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే ఇప్పటికే చెప్పారు. దాడి చేసిన వారు దాడిలో ప్రాణాలు కోల్పోయినవారు ఒకే వర్గానికి చెందిన వారని, కొందరు కావాలనే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉద్ధవ్ హెచ్చరించారు.