కరోనా కోసం కొత్త హెల్ప్‌లైన్ నంబర్లు

ABN , First Publish Date - 2020-03-17T00:21:40+05:30 IST

కరోనా వైరస్ వ్యాప్తి దేశం మొత్తాన్ని వణికిస్తోంది. ఇప్పటికే భారత్‌లో 100పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

కరోనా కోసం కొత్త హెల్ప్‌లైన్ నంబర్లు

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి దేశం మొత్తాన్ని వణికిస్తోంది. ఈ క్రమంలో గతంలో విడుదల చేసిన హెల్ప్‌లైన్ నంబర్లను మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటి స్థానంలో కొత్త హెల్ప్‌లైన్ నంబర్లను ప్రకటించింది. ఇప్పటికే భారత్‌లో 100పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ గురించి ఎటువంటి సమాచారం కావాలన్నా 1075 నంబరుకు కాల్ చేసి తెలుసుకోవచ్చని ప్రభుత్వం వెల్లడించింది. అదే విధంగా 1800-112-545 నంబరుకు ఫోన్ చేసినా కరోనా గురించి సమాచారం అందజేస్తామని తెలిపింది. కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టడం కోసం అందరూ కలిసి పనిచేయాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఈ నంబర్లకు తోడు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన హెల్ప్‌లైన్ నంబర్లు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాయని, వాటికి ఫోన్ చేసినా కరోనా గురించిన సమాచారం తెలుసుకోవచ్చని పేర్కొంది.

Updated Date - 2020-03-17T00:21:40+05:30 IST