సోషల్ మీడియాలో నెటిజన్ల ఆగ్రహం! టిక్ టాక్‌పై రివెంజ్ అంటూ..

ABN , First Publish Date - 2020-04-07T21:04:33+05:30 IST

చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచంలోని 200 దేశాలకు పాకి ప్రజలను వేధిస్తోంది. ఇప్పటికే 70 వేల మందికిపై ప్రజలు ఈ వ్యాధికి బలయ్యారు. ఈ ప్రమాదానికి చైనా ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని ప్రపంచ దేశాధినేతలు భావిస్తున్నారు. అయితే ఈ వ్యతిరేకత ప్రభుత్వాల మధ్యే ఉండి ఉంటే బాగుంది. కానీ ప్రజలు కూడా ఈ విషయంలో సీరియస్ అవుతున్నారు. కొందరు నెటిజన్లు ప్రతీకారం తీర్చుకోవాలనే తీవ్రమైన వాదనను తెరపైకి తెస్తున్నారు.

సోషల్ మీడియాలో నెటిజన్ల ఆగ్రహం! టిక్ టాక్‌పై రివెంజ్ అంటూ..

న్యూఢిల్లీ: చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచంలోని 200 దేశాలకు పాకి ప్రజలను వేధిస్తోంది. ఇప్పటికే 70 వేల మందికిపై ప్రజలు ఈ వ్యాధికి బలయ్యారు. ఈ ప్రమాదానికి చైనా ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని ప్రపంచ దేశాధినేతలు భావిస్తున్నారు. అయితే ఈ వ్యతిరేకత ప్రభుత్వాల మధ్యే ఉండి ఉంటే బాగుంది. కానీ ప్రజలు కూడా ఈ విషయంలో సీరియస్ అవుతున్నారు. ప్రతీకారం తీర్చుకోవాలనే తీవ్రమైన వాదనను కొందరు తెరపైకి తెస్తున్నారు.


ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ ధోరణి పెరుగుతోంది. చైనా ఉత్పత్తులను నిషేధించాలనే వాదన మరోసారి తెరపైకి వస్తోంది. చైనా యాప్ అయిన టిక్ టాక్‌ను దేశంలో బ్యాన్ చేయాలని కొందరు భారతీయ నెటిజన్లు తీవ్ర వ్యాఖ్యాలు చేస్తున్నారు. ఇక టిక్ టాక్‌కు ఉన్న కస్టమర్లలో సగం మంది భారతీయులే. ఓ భారత కస్టమర్‌ సగటున 52 నిమిషాలు యాప్‌లో గుడుపుతాడని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే టిక్ టాక్ కొందరికి ఆదాయ వనరు కూడా. ఇటువంటి వారిలో కొందిరికి ఉన్న ఆదాయ వనరు టిక్ టాక్ మాత్రమే. మరి ఈ యాప్‌పై నిషేధం విధించాలనే వాదనలు పెరుగుతున్న నేపథ్యంలో టిక్ టాక్‌పై ఆధారపడ్డ వారి పరిస్థితి ఏమిటనే ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది. 

Updated Date - 2020-04-07T21:04:33+05:30 IST