'నీట్' ఫలితాలు ఈనెల 16న

ABN , First Publish Date - 2020-10-12T22:09:57+05:30 IST

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పరీక్షా ఫలితాలు ఈనెల

'నీట్' ఫలితాలు ఈనెల 16న

న్యూఢిల్లీ: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పరీక్షా ఫలితాలు ఈనెల 16న విడుదల కానున్నాయి. కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిషాంక్ సోమవారంనాడు ఓ ట్వీట్‌లో ఈ విషయం తెలిపారు. వచ్చే శుక్రవారం ఎన్ని గంటలకు ఫలితాలు విడుదల చేస్తామనేది తర్వాత తెలియజేస్తామని అన్నారు. విద్యార్థులందరికీ ఆయన 'ఆల్ ది బెస్ట్' చెప్పారు.


నీట్‌లో వచ్చిన మార్కులు ఆధారంగా విద్యార్థులు అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్, డెంటల్ కోర్కుల్లో దరఖాస్తు చేసుకునే వీలుటుంది. గత సెప్టెంబర్ 13న కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా 'నీట్' పరీక్షలు నిర్వహిచారు. 15.97 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 13.52 లక్షల మంది పరీక్షలకు హాజరయ్యారు.


ఈ ఏడాది ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్‌మెర్) సహా అన్ని వైద్య కళాశాలల్లోనూ ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రోగ్రామ్స్ అడ్మిషన్లకు నీట్ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. గత ఏడాది, దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లన్నింటికీ కలిపి ఒకే నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్‌ ప్రకటిస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) చట్టాన్ని పార్లమెంటు ఆమోదించింది. దీనికి ముందు, ఎయిమ్స్, జిప్‌మెర్, ఇతర వైద్య కళాశాలలు సొంతంగా ఎంట్రన్స్ టెస్టులు నిర్వహించేవి.


కాగా, ఒకవైపు 'నీట్' పరీక్షల ఫలితాలు, ఎంసెట్ మెడికల్ ఫలితాలు విడుదల కాకుండానే ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

Updated Date - 2020-10-12T22:09:57+05:30 IST