60 శాతం వాహనాలకు బీమా లేదు...
ABN , First Publish Date - 2020-12-11T17:34:28+05:30 IST
రోడ్డు ప్రమాదాల్లో భారతదేశం అగ్రస్థానంలో నిలిచిందని తాజా గణంకాల్లో తేలింది....
న్యూఢిల్లీ : రోడ్డు ప్రమాదాల్లో భారతదేశం అగ్రస్థానంలో నిలిచిందని తాజా గణంకాల్లో తేలింది. దేశంలో వాహనాల్లో 60 శాతం బీమా చేయని వాహనాలేనని తేలింది. ద్విచక్రవాహనాల్లో 76 శాతం రోడ్డు ప్రమాదాలు సాగుతున్నాయి.బీమా చేయని వాహనాల్లో ద్విచక్రవాహనాలే ఎక్కువని తాజాగా తేలింది. దేశంలో 60 శాతం వాహనాలు బీమా చేయలేదని జనరల్ ఇన్సూరెన్సు కౌన్సిల్ ఆఫ్ ఇండియా నివేదికలో తేలింది. 2015-16 లో దేశంలో 19 కోట్ల వాహనాలు రిజిస్టరు చేయగా, రూ.8.26కోట్లు అంటే సగం కంటే తక్కువ వాహనాలకు బీమా చేయలేదని తేలింది. తనది పాత ద్విచక్రవాహనం కావడంతో తాను బీమా చేయించలేదని ఓ వాహనచోదకుడు చెప్పారు. ప్రతీ వాహన యజమానికి థర్డ్ పార్టీ బీమా ప్రభుత్వం తప్పని సరి చేసింది. వాహనం వల్ల ప్రమాదం జరిగి గాయపడినా, మరణం సంభవించినా కలిగే నష్టాన్ని పూడుస్తోంది.