మహారాష్ట్రలో మారని తీరు.. నేడు 6500 దాకా కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-07-14T01:12:07+05:30 IST

మహారాష్ట్రలో కరోనా తీరులో ఏ మార్పూ రావడం లేదు. రోజురోజుకూ కొత్త కేసులు పెరుగుతునే...

మహారాష్ట్రలో మారని తీరు.. నేడు  6500 దాకా కరోనా కేసులు

ముంబై: మహారాష్ట్రలో కరోనా తీరులో ఏ మార్పూ రావడం లేదు. రోజురోజుకూ కొత్త కేసులు పెరుగుతునే ఉన్నాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2లక్షల60వేలు దాటేసింది. అధికారిక లెక్కల ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 6,497 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 193 మంది మరణించారు. 4,182 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా నమోదైన కేసులతో కలుపుకొని రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 2,60,924కు చేరింది. వీరిలో 1,05,637మంది చికిత్స పొందుతుండగా 1,44,507మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా 10,482మంది మృత్యువాతపడ్డారు.

Updated Date - 2020-07-14T01:12:07+05:30 IST