3 నెలల వేతనం విరాళమిచ్చిన ముఖ్యమంత్రి

ABN , First Publish Date - 2020-03-24T16:26:21+05:30 IST

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తన పెద్దమనసు చాటుకున్నారు. కరోనా బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి తన మూడు నెలల జీతాన్ని...

3 నెలల వేతనం విరాళమిచ్చిన ముఖ్యమంత్రి

భువనేశ్వర్: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తన పెద్దమనసు చాటుకున్నారు. కరోనా బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి తన మూడు నెలల జీతాన్ని విరాళంగా ఇచ్చారు. అసాధారణ పరిస్థితుల్లో అసాధారణ స్పందన అవశ్యకతను చెబుతూ ముఖ్యమంత్రి ఈ విరాళం అందజేసినట్టు సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. బాధితులను ఆదుకునేందుకు ఉదారంగా విరాళాలతో ముందుకు రావాలని ప్రజలకు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.


కాగా, కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ముందస్తు చర్యగా ఒడిశాలో 5 జిల్లాల్లో విధించిన లాక్‌డౌన్‌ను సోమవారం నుంచి 15 జిల్లాలకు విస్తరించారు. పూరి, నయాగఢ్, జగత్సింగ్‌పూర్‌, జైపూర్, భద్రక్, బాలాసోర్, థెన్‌కనల్, సంబల్‌పూర్, ఝార్సుగూడ జిల్లాల్లో మార్చి 29 వరకూ ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకూ లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. హోం క్వారంటైన్‌‌లో ఉన్న వారి ఇళ్లకు స్టిక్కర్లు అంటించేందుకు కూడా ఒడిశా యంత్రాంగం నిర్ణయించింది.

Updated Date - 2020-03-24T16:26:21+05:30 IST