మైసూర్ ప్యాలెస్ మూసివేత
ABN , First Publish Date - 2020-07-09T05:30:00+05:30 IST
కర్ణాటకలోని మైసూర్ ప్యాలెస్ను గురువారం మూసివేశారు. ప్యాలెస్లో పనిచేసే...
మైసూర్: కర్ణాటకలోని మైసూర్ ప్యాలెస్ను గురువారం మూసివేశారు. ప్యాలెస్లో పనిచేసే ఉద్యోగి బంధువుకు కరోనా పాజిటివ్ రావడంతో మూసివేసినట్లు ప్రకటించారు. మళ్లీ సోమవారం మైసూర్ ప్యాలెస్ను తెరిచే అవకాశమున్నట్లు తెలిసింది. తొలుత కరోనా కారణంగా మార్చి 15 నుంచి 22 వరకూ వారం రోజుల పాటు ప్యాలెస్ను మూసివేసినట్లు ప్యాలెస్ కమిటీ తెలిపింది. ఇదిలా ఉంటే.. కర్ణాటకలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం గమనార్హం.
గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో కర్ణాటకలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా కర్ణాటకలో 2,228 కరోనా కేసులు నమోదు కాగా.. ఇందులో 1,373 కేసులు బెంగళూరులోనే నమోదు కావడం గమనార్హం. మరణాల సంఖ్య కూడా కొంత ఆందోళనకరంగానే ఉంది. గత 24 గంటల్లో కర్ణాటకలో కరోనా వల్ల 17 మంది మరణించారు. దీంతో.. మొత్తం కరోనా మరణాల సంఖ్య 486కు చేరింది.