ఆలయ రక్షణకు ముస్లిం యువకుల మానవహారం
ABN , First Publish Date - 2020-08-12T23:16:28+05:30 IST
సోషల్ మీడియాలో కనిపించిన ఓ పోస్ట్ బెంగళూరు అల్లర్లకు దారితీసినట్టు చెబుతున్న తరుణంలోనే కొందరు..

బెంగళూరు: సోషల్ మీడియాలో కనిపించిన ఓ పోస్ట్ బెంగళూరు అల్లర్లకు దారితీసిన సమయంలోనే కొందరు ముస్లిం యువకులు మత సామరస్యాన్ని చాటుకున్నారు. మంగళవారం రాత్రి అల్లర్లు చెలరేగిన సమయంలో కొందరు ముస్లిం యువకులు ఓ ఆలయాన్ని రక్షించేందుకు మానవ హారంగా నిలిచారు. సిటీలోని డీజే హళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇది చోటుచేసుకుంది.
ఆలయంపై అల్లరిమూక దాడులు జరపకుండా ముస్లిం యువకులు చేయీచేయీ కలిపి మానవహారంగా నిలవడం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మతసామరస్యాన్ని చాటుతున్న ఈ వీడియోను కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ షేర్ చేశారు. బెంగళూరు అల్లర్లకు పాల్పడిన వారిని కనిపెట్టండి. అరెస్టు చేసి కఠినమైన శిక్ష అమలు చేయండి...అని తన ట్వీట్లో శశిథరూర్ పేర్కొన్నారు.