ధారవిలో పెరిగిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-09-17T01:47:05+05:30 IST

ధారవిలో పెరిగిన కరోనా కేసులు

ధారవిలో పెరిగిన కరోనా కేసులు

ముంబై: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ముంబైలోని ధారవిలో కొత్తగా 15 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ముంబైలోని మురికివాడ కాలనీ ధారవిలో 2,960 కేసులు నమోదయ్యాయి. ధారవిలో 2,545 మంది రోగులు ఇప్పటికే కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 2.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ధారవి జనాభా 6.5 లక్షలకు పైగా ఉంది.

Updated Date - 2020-09-17T01:47:05+05:30 IST