ముంబై హోటల్లో అగ్నిప్రమాదం.... 25 మంది వైద్యులు సురక్షితం!
ABN , First Publish Date - 2020-05-28T11:06:46+05:30 IST
ఒకవైపు దేశంలో కరోనా విలయతాండవం చేస్తుండగా, మరోవైపు అక్కడక్కడా అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ముంబైలోని మెరైన్ డ్రైవ్ సమీపంలో గల ప్రముఖ ఫార్చ్యూన్ హోటల్లో అగ్ని ప్రమాదం...
ముంబై: ఒకవైపు దేశంలో కరోనా విలయతాండవం చేస్తుండగా, మరోవైపు అక్కడక్కడా అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ముంబైలోని మెరైన్ డ్రైవ్ సమీపంలో గల ప్రముఖ ఫార్చ్యూన్ హోటల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 12 అగ్నిమాపక వాహనాల్లో అక్కడికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు. హోటల్లో చిక్కుకున్న 25 మంది వైద్యులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చి, మెట్రో సినిమా సమీపంలోని మరో హోటల్కు తరలించామని అగ్నిమాపక అధికారులు తెలిపారు. హోటల్ భవనంలోని 2 వ, 4 వ అంతస్తులలో ఈప్రమాదం చోటుచేసుకుంది.