ముంబై డిజైనర్ ఆత్మహత్య కేసు చార్జిషీటు
ABN , First Publish Date - 2020-12-06T07:34:15+05:30 IST
ముంబైకు చెందిన డిజైనర్ అన్వయ్ నాయక్ ఆత్మహత్య కేసులో రాయ్గఢ్ జిల్లాలోని అలీబాగ్ కోర్టులో పోలీసులు శుక్రవారం చార్జిషీట్ సమర్పించారు.

ముంబై, డిసెంబరు 5: ముంబైకు చెందిన డిజైనర్ అన్వయ్ నాయక్ ఆత్మహత్య కేసులో రాయ్గఢ్ జిల్లాలోని అలీబాగ్ కోర్టులో పోలీసులు శుక్రవారం చార్జిషీట్ సమర్పించారు. తనకు రావాల్సిన బకాయిలు చెల్లించకపోతే బలవన్మరణానికి పాల్పడతానన్న నాయక్ హెచ్చరికను రిపబ్లిక్ టీవీ ఎడిటర్-ఎన్-చీ్ఫ అర్ణబ్ గోస్వామి సహా మిగిలిన ఇద్దరు నిందితులు పెడచెవిన పెట్టారని అందులో పేర్కొన్నారు. కన్కోర్డీ డిజైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు యజమానైన నాయక్కు అర్ణబ్(రిపబ్లిక్ మీడియా) నుంచి రూ. 83లక్షలు.. ఫిరోజ్ నుంచి రూ. 4కోట్లు, నితీశ్ నుంచి రూ. 55లక్షలు రావాల్సి ఉంది. చార్జిషీటుపై ఈ నెల 16న కోర్టు విచారణ జరపనుంది.