కరోనా రోగుల సాంత్వన కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటు చేసిన శివరాజ్ సింగ్ ప్రభుత్వం
ABN , First Publish Date - 2020-04-26T21:52:06+05:30 IST
కోవిడ్ - 19 బాధితులకు స్వాంతన చేకూర్చడానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఏకంగా ఓ ప్రత్యేక శాఖనే ప్రకటించారు.

భోపాల్ : కోవిడ్ - 19 బాధితులకు సాంత్వన చేకూర్చడానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఏకంగా ఓ ప్రత్యేక శాఖనే ప్రకటించారు. ‘హ్యాపినెస్ డిపార్ట్మెంట్’ (ఆనందాన్ని పంచే శాఖ) పేరుతో ఓ శాఖను ఏర్పాటు చేశారు. కోవిడ్ - 19 బాధితులకు సాంత్వన చేకూర్చడమే ఈ శాఖ పని. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ఆయన ‘ఆనంద విభాగ్’ పేరుతో ఓ శాఖను ఏర్పాటు చేశారు. తరువాతి కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో దీన్ని కాస్తా ‘ఆధ్యాత్మిక విభాగం’ లో విలీనం చేసేశారు.
ఈ క్లిష్ట సమయంలో దీనిని కోవిడ్ - 19 కు వ్యతిరేకంగా పోరాడే శాఖకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను తాజాగా ఆదేశించారు. కరోనా సోకిన వారి చుట్టూ ఆనందకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడంతో పాటు, వారి మానసిక స్థైర్యాన్ని, ఒత్తిడి తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ శాఖను తిరిగి ఏర్పాటు చేసిందని అధికారులు పేర్కొన్నారు.
అయితే ఈ శాఖను ఏర్పాటు చేయడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ స్పందించింది. కోవిడ్ - 19 ను ఎదుర్కోవడంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కోవిడ్ను ఎదుర్కోవడంలో దృష్టి పెడితే బాగుంటుందని అన్నారు. ఇది పూర్తిగా పబ్లిసిటీ స్టంట్ అని కాంగ్రెస్ విమర్శించింది.