తల్లి మళ్లీ క్వారంటైన్ సెంటర్కు పంపిందని కుమారుని ఆత్మహత్య!
ABN , First Publish Date - 2020-06-01T15:54:07+05:30 IST
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జిల్లాలోని సహద్లిపూర్ గ్రామానికి చెందిన ఒక యువకుడిని, అతని తల్లి క్వారంటైన్ సెంటర్కు పంపిందని కలత చెంది, ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని...
కాన్పూర్: ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జిల్లాలోని సహద్లిపూర్ గ్రామానికి చెందిన ఒక యువకుడిని, అతని తల్లి క్వారంటైన్ సెంటర్కు పంపిందని కలత చెంది, ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతదేహం గంగా నది ఒడ్డున ఉన్న జమదా ఆశ్రమం సమీపంలో గల చెట్టుకు వేలాడుతూ కనిపించింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. సహద్లిపూర్ నివాసి సూరజ్ సింగ్ యాదవ్ (23) మహారాష్ట్రలోని నాసిక్లో వడ్రంగిగా పనిచేసేవాడు. మే 15 న అతను గ్రామానికి చేరుకున్నాక, అతనిని అపోలో కాలేజీలోని క్వారంటైన్ సెంటర్కు తరలించారు. అయితే సూరజ్ సింగ్ మే 23న క్వారంటైన్ సెంటర్ నుంచి పారిపోయి, ఇంటికి వచ్చాడు. దీంతో అతని తల్లి, సోదరుడు అతనితో క్వారంటైన్ కాలాన్ని పూర్తి చేశాకే ఇంటికి రావాలని చెబుతూ, తిరిగి సూరజ్ను క్వారంటైన్ సెంటర్కు దిగబెట్టారు. దీంతో కలత చెందిన సూరజ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.