భారత్‌లో కరోనా తీవ్రతకు సంబంధించిన తాజా అప్‌డేట్ ఇది..!

ABN , First Publish Date - 2020-08-20T14:01:21+05:30 IST

భారత్‌లో కోవిడ్-19 టెస్టుల సంఖ్యను కేంద్రం గణనీయంగా పెంచింది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా...

భారత్‌లో కరోనా తీవ్రతకు సంబంధించిన తాజా అప్‌డేట్ ఇది..!

భారత్‌లో గడచిన 24 గంటల్లో 9 లక్షలకు పైగా కోవిడ్-19 టెస్టులు

గడచిన 24 గంటల్లో కొత్తగా 70,101 కరోనా కేసులు, 978 కరోనా మరణాలు

న్యూఢిల్లీ: భారత్‌లో కోవిడ్-19 టెస్టుల సంఖ్యను కేంద్రం గణనీయంగా పెంచింది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 9లక్షలకు పైగా కోవిడ్-19 టెస్టులు చేసినట్లు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా పాజిటివిటీ రేటు 8 శాతం తగ్గినట్లు ప్రకటించింది. కేంద్ర ఆరోగ్య శాఖ పాజిటివిటీ రేటు తగ్గినట్టు చెబుతున్నప్పటికీ కొత్తగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య కలవరపాటుకు గురిచేస్తోంది.


భారత్‌లో గడచిన 24 గంటల్లో కొత్తగా 70,101 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో.. భారత్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 28,33,015కి చేరింది. మరణాల సంఖ్య కూడా ఆందోళన కలిగిస్తోంది. భారత్‌లో గడచిన 24 గంటల్లో 978 మంది కరోనా వల్ల మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 53,929కి చేరింది. కరోనా కేసుల్లో దేశంలోనే అగ్ర స్థానంలో ఉన్న మహారాష్ట్రలో గడచిన 24 గంటల్లో అత్యధికంగా 13,165 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం.



Updated Date - 2020-08-20T14:01:21+05:30 IST