మహారాష్ట్రలో కరోనా కల్లోలం.. 24 గంటల్లో 3000కు పైగా పాజటివ్ కేసులు
ABN , First Publish Date - 2020-05-25T01:46:45+05:30 IST
మహారాష్ట్రలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఒక్కరోజులో 3000కు పైగా కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత దారుణంగా...

ముంబై: మహారాష్ట్రలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఒక్కరోజులో 3000కు పైగా కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసులతో పాటు ప్రతిరోజూ నమోదవతున్న కేసుల్లో సగభాగం కేవలం మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. కొత్తగా నమోదైన కేసులకు సంబంధించి రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన నివేదిక దీనికి ఆధారంగా నిలుస్తోంది. దాని ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 3,041 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 58 మంది మరణించారు.
కాగా 1,196 మంది నేడు ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా నమోదైన కేసులతో కలుపుకొని రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 50,231కి చేరింది. 1,635 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటివరకు 14,600 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా 33,988 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.