కొత్త ‘స్ట్రెయిన్‌’తో అధిక మరణాలు

ABN , First Publish Date - 2020-12-25T08:49:45+05:30 IST

యునైటెడ్‌ కింగ్‌డం(యూకే)కు ముచ్చెమటలు పట్టిస్తున్న కరోనా కొత్త రకం స్ట్రెయిన్‌ వైరస్‌.. అత్యంత ప్రమాదకరమని తమ అధ్యయనంలో తేలిందని లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజీన్‌ అండ్‌ ట్రాపికల్‌ మెడిసిన్‌ బాంబు పేల్చింది.

కొత్త  ‘స్ట్రెయిన్‌’తో అధిక మరణాలు

‘లండన్‌ స్కూల్‌’ అధ్యయనంలో వెల్లడి


లండన్‌, డిసెంబరు 24: యునైటెడ్‌ కింగ్‌డం(యూకే)కు ముచ్చెమటలు పట్టిస్తున్న కరోనా కొత్త రకం స్ట్రెయిన్‌ వైరస్‌.. అత్యంత ప్రమాదకరమని తమ అధ్యయనంలో తేలిందని లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజీన్‌ అండ్‌ ట్రాపికల్‌ మెడిసిన్‌ బాంబు పేల్చింది. ఈ కొత్త స్ట్రెయిన్‌ వల్ల యూకేలో వచ్చే ఏడాదిలో అధికశాతం మంది మృత్యువాత పడతారని వెల్లడించింది. ఆస్పత్రుల్లోనూ రోగులు అదే స్థాయిలో చేరతారని తెలిపింది. ఇదివరకటి రకాలను మించి ఈ స్ట్రెయిన్‌ 56శాతం వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో ప్రమాదం కూడా భారీ స్థాయిలో పొంచివుందని పేర్కొంది.  

Updated Date - 2020-12-25T08:49:45+05:30 IST