మనీలాండరింగ్ కేసులో శివసేన ఎమ్మెల్యే సన్నిహితుడి అరెస్ట్

ABN , First Publish Date - 2020-11-26T14:45:37+05:30 IST

మనీలాండరింగ్ కేసులో శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ బంధువు, దగ్గరి వ్యాపార సహచరుడు అమిత్ చందోల్‌ను ఎన్‌ఫోర్సు‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ....

మనీలాండరింగ్ కేసులో శివసేన ఎమ్మెల్యే సన్నిహితుడి అరెస్ట్

ముంబై (మహారాష్ట్ర): మనీలాండరింగ్ కేసులో శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ బంధువు, దగ్గరి వ్యాపార సహచరుడు అమిత్ చందోల్‌ను ఎన్‌ఫోర్సు‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బుధవారం రాత్రి అరెస్టు చేశారు. ఈ కేసులో ఇది మొదటి అరెస్టు. రాహుల్ నందా యాజమాన్యంలోని టాపస్ గ్రూపునకు చెందిన కేసులో ఈడీ అరెస్టు చేసిన అమిత్ చందోల్ ను గురువారం కోర్టులో హాజరుపర్చనున్నారు. రియల్ ఎస్టేట్, ఆతిథ్య వ్యాపారాల్లో ఉన్న అమిత్ చందోల్ ఇంటిపై దాడి చేసిన ఈడీ అధికారులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.శివసేన ఎమ్మెల్యే సర్నాయక్ కుమారుడు విహాంగ్ ను ఈడీ ప్రశ్నించే అవకాశముంది. 


విహాంగ్ ను ఈడీ అధికారులు ఐదు గంటలపాటు విచారించారు.విదేశాలకు డబ్బు తరలించడానికి శివసేన ఎమ్మెల్యే  టాప్స్ గ్రూపు వ్యాపార సంస్థల్లోకి అక్రమంగా డబ్బు పంపించారని కేంద్ర ఏజెన్సీ అనుమానిస్తుంది. కాగా రాహుల్ నందా ఈ ఆరోపణలను ఖండించారు. శివసేన  ఎమ్మెల్యే తనకు పాత స్నేహితుడని, తన సంస్థలో అతను ఒక్క పైసా కూడా పెట్టుబడి లేదని రాహుల్ నందా స్పష్టం చేశారు. సర్నాయిక్ అతని కుటుంబసభ్యులు నందా కంపెనీల్లో చట్టవిరుద్ధంగా పెట్టుబడులు పెట్టారని ఈడీ వర్గాలు అంటున్నాయి.  

Updated Date - 2020-11-26T14:45:37+05:30 IST