జూన్ అంతా మోదీ సర్కార్ వార్షికోత్సవం
ABN , First Publish Date - 2020-05-29T06:54:12+05:30 IST
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా జూన్ 1 నుంచి నెల రోజులపాటు దేశంలోని అన్ని జిల్లాల్లో ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని...

న్యూఢిల్లీ, మే 28 (ఆంధ్రజ్యోతి): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా జూన్ 1 నుంచి నెల రోజులపాటు దేశంలోని అన్ని జిల్లాల్లో ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. అన్ని జిల్లాల్లో డిజిటల్ ర్యాలీలు నిర్వహిస్తామని పార్టీ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్గురువారం విలేకరుల సమావేశంలో తెలిపారు.