వ్యాక్సిన్ తీసుకున్న మంత్రికి కరోనా పాజిటివ్
ABN , First Publish Date - 2020-12-05T19:15:59+05:30 IST
కరోనా వ్యాక్సిన్ తయారై మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి రానుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ తయారీలో తలమునకలై ఉన్నాయి. భారత్ కూడా కరోనా వ్యాక్సిన్ను తయారు చేస్తోంది. అందులో భారతీ బయోటెక్కు...
చండీఘర్: కరోనా వ్యాక్సిన్ తయారై మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి రానుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ తయారీలో తలమునకలై ఉన్నాయి. భారత్ కూడా కరోనా వ్యాక్సిన్ను తయారు చేస్తోంది. అందులో భారతీ బయోటెక్కు చెందిన కొవాక్సిన్ ఫైనల్ ట్రయల్స్లో ఉంది. అయితే ఇప్పుడు ఈ వ్యాక్సిన్కు సంబంధించి ఓ సంచలన విషయం బయటపడింది.కొద్ది వారాల క్రితం హర్యానా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ కూడా ఈ ట్రయల్స్లో పాల్గొన్నారట. అయితే వ్యాక్సిన్ తీసుకున్న కొద్ది రోజుల తరువాత ఆయనకు కరోనా సోకినట్లు పరీక్షల్లో నిర్ధారణ అయిందట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.
‘ఇటీవల నేను కొవ్యాక్సిన్ ట్రయల్స్లో పాల్గొన్నాను. అయితే వ్యాక్సిన్ తీసుకున్న తరువాత కొద్ది వారాలకు కరోనా టెస్ట్ చేయించుకుంటే అందులో పాజిటివ్ వచ్చింది’ అని అనిల్ విజ్ తెలిపారు. ఈ మధ్యకాలంలో తనతో సన్నిహితంగా మెలిగిన ప్రతి ఒక్కరూ కరోనా టెస్ట్ చేయించుకోవాలని, హోం క్వారంటైన్ కావాలని ఆయన అభ్యర్థించారు.
ఇదిలా ఉంటే హర్యానాలో కొవ్యాక్సిన్ ట్రయల్స్ అనిల్ విజ్తోనే ప్రారంభమయ్యాయి. హర్యానా మొత్తం మీద ఆయనే తొలి సారిగా ఈ వ్యాక్సిన్ ట్రయల్స్లో పాల్గొన్నారు.