ఢిల్లీ- యూపీ సరిహద్దులో భారీగా గుమిగూడిన వలస కార్మికులు
ABN , First Publish Date - 2020-05-17T14:27:07+05:30 IST
ఢిల్లీ - యూపీ సరిహద్దుల్లోని ఘాజీపూర్ వద్ద వలస కార్మికులు భారీ సంఖ్యలో గుమిగూడారు. లాక్డౌన్ కారణంగా

న్యూఢిల్లీ : ఢిల్లీ - యూపీ సరిహద్దుల్లోని ఘాజీపూర్ వద్ద వలస కార్మికులు భారీ సంఖ్యలో గుమిగూడారు. లాక్డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయి, కాలినడకన స్వస్థలాలకు చేరే వారికి బస్సులను అందుబాటులోకి తేవాలని యోగి సర్కార్ అధికారులను ఆదేశించింది. అవురియా రోడ్డు ప్రమాదంలో 24 మంది వలస కార్మికులు దుర్మరణం పాలుకావడంతో, వలస కార్మికుల కోసం బస్సులను ఏర్పాటు చేయాలని యూపీ ప్రభుత్వం నిర్ణయించింది.
దీంతో వలస కార్మికులందరూ ఘజియాపూర్ వద్ద గుమిగూడారు. ‘‘ఢిల్లీ - యూపీ సరిహద్దుల్లోని ఘాజీపూర్ వద్ద వలస కార్మికులు ఎక్కువ సంఖ్యలో గుమిగూడారు. రైళ్లలో, బస్సుల్లో ప్రయాణించమని మేము కోరుతున్నాం. సరియైన అనుమతి పాసులు లేకుండా ఉంటే మాత్రం రాష్ట్రంలోకి అనుమతించం’’ అని పోలీసు ఉన్నతాధికారి స్పష్టం చేశారు.