ఫేస్బుక్పై మరో దెబ్బ..
ABN , First Publish Date - 2020-07-01T05:09:45+05:30 IST
ప్రపంచ వ్యాప్తంగా అనేక కంపెనీలు ప్రస్తుతం ఫేస్బుక్ను బాయ్కాట్ చేసే పనిలో ఉన్నాయి.
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా అనేక కంపెనీలు ప్రస్తుతం ఫేస్బుక్ను బాయ్కాట్ చేసే పనిలో ఉన్నాయి. జాతి, లింగ వివక్షపూరిత పోస్టులకు ఫేస్బుక్ వేదిక అవుతున్నందుకు ఈ నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా ఈ కంపెనీల జాబితాలో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కూడా వచ్చి చేరింది. ఫేస్బుక్, ఇన్స్టాలకు యాడ్లను ఇవ్వొద్దనే నిర్ణయానికి మైక్రోసాఫ్ట్ వచ్చినట్టు సమాచారం. పోర్నోగ్రఫీ, ద్వేష పూరిత పోస్టులు ఉండే వేదికలోనే మైక్రోసాఫ్ట్ యాడ్లు కనిపించడం తమకు ఆందోళనకరమని సంస్థ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మే నెలలో మైక్రోసాఫ్ట్ పేస్బుక్కు ప్రకటనలు ఇవ్వడం నిలిపివేసిందట. తాజాగా ఈ నిషేధాన్ని ఆగస్టు నెల వరకూ పొడిగించినట్టు సమాచారం. కాగా..గత సంవత్సరం ఫేస్బుక్లో ప్రకటనలు ఇచ్చినందుకు మైక్రోసాఫ్ దాదాపు 115 మిలియన్ డాలర్లు ఖర్చు చేసింది.