జూన్ 8న తెరుచుకోనున్న మ‌ధుర‌, బృందావ‌న ఆల‌యాలు!

ABN , First Publish Date - 2020-06-01T17:55:39+05:30 IST

రెండున్నర నెలల సుదీర్ఘ లాక్‌డౌన్ అనంత‌రం యూపీలోని మధుర, బృందావనం దేవాలయాలు జూన్ 8 నుంచి భక్తుల కోసం తెరుచుకోనున్నాయి. ప్ర‌భుత్వం సూచించిన కొత్త మార్గదర్శకాల ప్రకారం జూన్ 8 నుండి...

జూన్ 8న తెరుచుకోనున్న మ‌ధుర‌, బృందావ‌న ఆల‌యాలు!

మధుర: రెండున్నర నెలల సుదీర్ఘ లాక్‌డౌన్ అనంత‌రం యూపీలోని మధుర, బృందావనం దేవాలయాలు జూన్ 8 నుంచి భక్తుల కోసం తెరుచుకోనున్నాయి. ప్ర‌భుత్వం సూచించిన కొత్త మార్గదర్శకాల ప్రకారం జూన్ 8 నుండి దేవాలయాలు తెరవనున్నారు. బ్రజ్‌లోని ప్రసిద్ధ ద్వారకాధిశ్‌ ఆలయ అధికారి రాకేశ్ తివారీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జూన్ 8 నుంచి ఆలయ తలుపులు తెర‌వ‌నున్నాం. ఆల‌యానికి వ‌చ్చే భక్తులు సామాజిక దూరాన్ని పాటిస్తూ, మాస్కులు ధ‌రించ‌డం త‌ప్ప‌నిస‌రి అని అన్నారు. మ‌రోవైపు ఎమ్మెల్యే శ్రీకాంత్ శర్మ బృందావనం అభివృద్ధి పనులను సమీక్షించారు. ఈ సమయంలో అసంపూర్తిగా ఉన్న పనులపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప‌నుల‌ను దేవాలయాల ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని అధికారుల‌ను ఆదేశించారు. రూ. 12 కోట్ల వ్యయంతో బృందావన్ కుంజ్ వీధుల‌లో భూగర్భ కేబులింగ్ జరుగుతోందని తెలిపారు. అదేవిధంగా ఆల‌య సుందరీకరణ ప‌నుల‌ను రూ .38 కోట్ల వ్యయంతో చేప‌డుతున్న‌ట్లు తెలిపారు. 

Updated Date - 2020-06-01T17:55:39+05:30 IST