95 శాతం మంది మాస్క్‌ ధరిస్తున్నారు

ABN , First Publish Date - 2020-07-05T07:39:54+05:30 IST

కరోనా కల్లోలం నేపథ్యంలో ప్రజలు జాగరూకులై వ్యవహరిస్తున్నారా ? లేదా ? అనేది తెలుసుకునేందుకు నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అప్లైడ్‌ ఎకానమిక్‌ రిసెర్చ్‌(ఎన్‌సీఏఈఆర్‌)...

95 శాతం మంది మాస్క్‌ ధరిస్తున్నారు

న్యూఢిల్లీ, జూలై 4 : కరోనా కల్లోలం నేపథ్యంలో ప్రజలు జాగరూకులై వ్యవహరిస్తున్నారా ? లేదా ? అనేది తెలుసుకునేందుకు నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అప్లైడ్‌ ఎకానమిక్‌ రిసెర్చ్‌(ఎన్‌సీఏఈఆర్‌) జరిపిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. 95 శాతానికిపైగా ప్రజలు మాస్క్‌ను ధరిస్తుండగా, 45 శాతం మంది 3 అడుగుల భౌతిక దూరం పాటిస్తున్నట్లు వెల్లడైంది. 66 శాతం మంది హ్యాండ్‌ శానిటైజర్లు వాడుతుండగా, బహిరంగ ప్రదేశాలకు వెళ్లి వచ్చిన తర్వాత స్నానం చేయడం, చేతులను సబ్బుతో కడుగుతున్న వారు 66 శాతం మంది ఉన్నట్లు సర్వేలో తెలిసింది. అయితే ఈ జాగ్రత్త చర్యలన్నీ పాటిస్తున్నవారు 32 శాతం మందే ఉన్నారని గుర్తించారు.  

Updated Date - 2020-07-05T07:39:54+05:30 IST