విచారణ జరుగుతుండగా.. జడ్జిపై షూ విసిరిన నిందితుడు

ABN , First Publish Date - 2020-02-05T21:05:16+05:30 IST

ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ నిందితుడు విచారణ జరుపుతున్న న్యాయమూర్తిపైకి షూ విసిరాడు.

విచారణ జరుగుతుండగా.. జడ్జిపై షూ విసిరిన నిందితుడు

ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ నిందితుడు విచారణ జరుపుతున్న న్యాయమూర్తిపైకి షూ విసిరాడు. ఈ ఘటన కోల్‌కతాలోని బాంక్‌షాల్ కోర్టులో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బెంగాల్‌కు చెందిన అబు మూసా అనే వ్యక్తికి ఐసిస్‌, జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్(జేఎంబీ) వంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని ఆరోపణలున్నాయి. దీంతో అతన్ని నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

 

ఈ కేసుపై మంగళవారం విచారణ జరుగుతుండగా న్యాయమూర్తి ప్రశాంజిత్ బిస్వాస్‌పైకి మూసా షూ విసిరాడు. ఆ షూ జడ్జి ప్రశాంజిత్‌కు తగల్లేదుకానీ, పక్కనే ఉన్న ఎన్‌ఐఏ తరఫు న్యాయవాది తమాల్ ముఖర్జీకి గట్టిగా తగిలింది. ఈ షూ విసిరేప్పుడు, ‘నాకు మీ చట్టాలపై నమ్మకం లేదు’ అంటూ మూసా పెద్దగా అరిచినట్లు తెలుస్తోంది.

Updated Date - 2020-02-05T21:05:16+05:30 IST