భార్య చితిపైకి దూకి.. బంధువుల రక్షిస్తే..మళ్లీ బావిలోకి దూకి..!

ABN , First Publish Date - 2020-06-24T00:16:45+05:30 IST

వారిపెళ్లై ఆరు నెలలు కూడా కాలేదు. ఇంతలో ఆమె మృతి చెందింది. అప్పటికే ఆమె గర్భవతి. భర్యా రుచిత దూరమవడాన్ని భర్త కిషోర్ తట్టుకోలేక పోయాడు. ఆమె లేని ప్రపంచంలో తను ఉండలేనని నిశ్చయించుకుని భార్య చితిపై దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. అదృష్టవశాత్తూ బంధువులు అతడిని కాపాడాగలిగారు. కానీ అతడి నిర్ణయాన్ని మాత్రం మార్చలేక పోయారు. దీంతో అతడు ఈ సారి బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

భార్య చితిపైకి దూకి.. బంధువుల రక్షిస్తే..మళ్లీ బావిలోకి దూకి..!

చంద్రపూర్: ఈ ఏడాది మార్చిలోనే వారి వివాహం జరిగింది. పెళ్లై ఆరు నెలలు కూడా కాలేదు. ఇంతలో ఆమె మృతి చెందింది. అప్పటికే ఆమె గర్భవతి. భార్య రుచిత దూరమవడాన్ని భర్త కిషోర్ తట్టుకోలేక పోయాడు. ఆమె లేని ప్రపంచంలో తను ఉండలేనని నిశ్చయించుకుని భార్య చితిపై దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. అదృష్టవశాత్తూ బంధువులు అతడిని కాపాడాగలిగారు. కానీ అతడి నిర్ణయాన్ని మాత్రం మార్చలేక పోయారు. దీంతో అతడు ఈ సారి బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.


కాగా.. భార్య కూడా అంతకుమునుపే ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదిలిందని పోలీసులు తెలిపారు. నాలుగు రోజుల క్రితం ఆమె తన తల్లికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో పుట్టింటికి వెళ్లిందని వారు అన్నారు. ఆదివారం నాడు ఆమె ఇంటికి తీసుకెళ్లేందుకు భర్త కూడా అత్తమామల దగ్గరకు వెళ్లాడు. అక్కడ ఆమె కనిపించకపోవడంతో బంధువులందరూ కలిసి ఆమె కోసం గాలించారు.


ఈ క్రమంలో బావిలో తేలుతూ ఆమె కినిపించింది. ఆత్మహత్యకు పాల్పడిందని తెలుసుకు భర్తతో పాటూ బంధువులందరూ బోరున విలపించారు. సోమవారం నాడు ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె చితికి నిప్పటించి వెనక్కు వచ్చిన కిషోర్.. అకస్మాత్తుగా భార్య చితిలోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అయితే బంధువుల అతడిని కాపాడారు.


కిషోర్ మళ్లీ వారి నుంచి విడిపించుకుని.. పక్కనే ఉన్న బావిలోకి దూకేశాడు. అతడిని రక్షించేందుకు బంధువులు బావిలోకి తాడు విసిరనప్పటికీ అతడు దాన్ని అందుకోలేదు. భార్యతో ఎడబాటు తట్టుకోలేక అతడు నీళ్లలో మునిగి ప్రాణాలు విడిచాడు. మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లా తలోఢి గ్రామంలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టిస్తోంది.

Updated Date - 2020-06-24T00:16:45+05:30 IST