అంబేడ్కర్ ఇంటిపై దాడి ఘటనలో ఒకరి అరెస్టు
ABN , First Publish Date - 2020-07-10T07:19:55+05:30 IST
ముంబైలోని దాదర్లో అంబేడ్కర్ అధికారిక నివాసం ‘రాజ్గృహ్’ పై దాడి చేసిన ఘటనలో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతడిని సెంట్రల్ ముంబైకు చెందిన ఉమేష్ సీతారాం జాదవ్(35)గా...
ముంబై, జూలై 9: ముంబైలోని దాదర్లో అంబేడ్కర్ అధికారిక నివాసం ‘రాజ్గృహ్’ పై దాడి చేసిన ఘటనలో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతడిని సెంట్రల్ ముంబైకు చెందిన ఉమేష్ సీతారాం జాదవ్(35)గా గుర్తించారు. అంబేడ్కర్ నివాసంలో వస్తువులను ధ్వంసం చేస్తూ సీసీటీవీ ఫుటేజీలో కనబడిన ఇద్దరిలో అతను ఒకడు. మరొకరు పరారీలో ఉన్నారు.