విమానాలు రద్దు చేయాలంటూ మోదీకి లేఖ రాసిన మమత

ABN , First Publish Date - 2020-03-23T20:27:51+05:30 IST

బెంగాల్‌కు వచ్చే అన్ని విమానాలను రద్దు చేయాలంటూ సోమవారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని మోదీకి

విమానాలు రద్దు చేయాలంటూ మోదీకి లేఖ రాసిన మమత

కోల్‌కతా : బెంగాల్‌కు వచ్చే అన్ని విమానాలను రద్దు చేయాలంటూ సోమవారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని మోదీకి లేఖ రాశారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని విమానాలను రద్దు చేయాలని లేఖలో కోరారు. ‘‘ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే కేంద్రం రాష్ట్రంలోకి విమానాలను అనుమతిస్తోంది. ఈ విషయాన్ని తాము సీరియస్‌గా పరిగణిస్తున్నాం. ప్రజలు సామాజిక దూరం పాటించకపోవడంతో చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీని దృష్ట్యా బెంగాల్‌కు వచ్చే అన్ని విమానాలను రద్దు చేయండి. లేదంటే కరోనా విజృంభించే అవకాశాలున్నాయి’’ అని మమత లేఖలో ప్రస్తావించారు. కరోనాను అరికట్టడానికి ఇప్పటికే రవాణా రంగాన్ని బంద్ చేశామని, బస్సులను కూడా రద్దు చేశామని లేఖ ద్వారా మోదీ దృష్టికి తీసుకొచ్చారు. 

Updated Date - 2020-03-23T20:27:51+05:30 IST