మోదీ గారూ, రూ.25 వేల కోట్లు ఇవ్వండి : మమత

ABN , First Publish Date - 2020-04-02T02:55:16+05:30 IST

పశ్చిమ బెంగాల్ ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని ముఖ్యమంత్రి మమత బెనర్జీ పేర్కొన్నారు. బుధవారం

మోదీ గారూ, రూ.25 వేల కోట్లు ఇవ్వండి :  మమత

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని ముఖ్యమంత్రి మమత బెనర్జీ పేర్కొన్నారు. బుధవారం ఆమె ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావలసిన బకాయిలను విడుదల చేయాలని కోరారు. 


చాలా రాష్ట్రాల మాదిరిగానే పశ్చిమ బెంగాల్ ఆర్థిక పరిస్థితి కూడా దయనీయంగా ఉందని మోదీకి మమత తెలిపారు. దాదాపుగా అన్ని వ్యాపారాలను మూసివేయడం వల్ల ఆదాయం రావడం లేదన్నారు. అయినప్పటికీ తాము ఏదో విధంగా జీతాలు, వేతనాలు, ప్రభుత్వోద్యోగుల పింఛన్లు ఈ నెలకు చెల్లించామని తెలిపారు. ఈ పనిని చాలా పెద్ద రాష్ట్రాలు  సైతం చేయలేకపోతున్నాయన్నారు. తమ రాష్ట్రానికి కనీసం రూ.25,000 కోట్లు మంజూరు చేయాలని, ఇప్పటికీ భారత ప్రభుత్వం నుంచి రావలసిన నిధులను విడుదల చేయాలని కోరారు.


Updated Date - 2020-04-02T02:55:16+05:30 IST