రోజూ 1000 పీపీఈల తయారీ: రైల్వే శాఖ
ABN , First Publish Date - 2020-04-08T09:11:56+05:30 IST
వైద్యులకు వైరస్ నుంచి రక్షణ కల్పించే పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్వి్పమెంట్ సూట్(పీపీఈ)ల తయారీకి రైల్వే శాఖ సిద్ధమైంది.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: వైద్యులకు వైరస్ నుంచి రక్షణ కల్పించే పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్వి్పమెంట్ సూట్(పీపీఈ)ల తయారీకి రైల్వే శాఖ సిద్ధమైంది. డీఆర్డీవో అనుమతి లభించడంతో 17 వర్క్షాపుల్లో రోజూ 1000పీపీఈలను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రైల్వే ఆస్పత్రుల్లో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, ఇతర పారామెడికల్ సిబ్బందికి ఈ పీపీఈలను అందజేస్తామన్నది. పీపీఈల కొరతతో తమ రాష్ట్రానికి చెందిన నర్సు లు ఢిల్లీ, మహారాష్ట్రల్లో కరోనా బారిన పడ్డారని కేరళ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంపై దృష్టి సారించాలని సీఎం పినరయి విజయన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు.