మహారాష్ట్రలో కొత్తగా 278 మంది పోలీసులకు కరోనా

ABN , First Publish Date - 2020-07-09T03:15:15+05:30 IST

మహారాష్ట్రలో కొత్తగా 278 మంది పోలీసులకు కరోనా

మహారాష్ట్రలో కొత్తగా 278 మంది పోలీసులకు కరోనా

ముంబై: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో బుధవారం రోజు కొత్తగా మరో 278 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 5,713 మంది పోలీసులకు కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. కరోనా నుంచి 4,531 మంది పోలీసులు కోలుకున్నారని అధికారులు వెల్లడించారు.


Updated Date - 2020-07-09T03:15:15+05:30 IST