మహారాష్ట్రలో కొత్తగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు
ABN , First Publish Date - 2020-06-12T03:08:54+05:30 IST
మహారాష్ట్రలో కొత్తగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు

ముంబై: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ మహారాష్ట్రలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. గురువారం ఒక్కరోజులోనే 3,607 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 97,648 కరోనా నమోదయ్యాయి. ఇవాళ కరోనా వల్ల మహారాష్ట్రలో 152 మంది చనిపోగా.. మొత్తం 3,590 మంది కోవిడ్-19తో మృతి చెందినట్లు వైద్య శాఖ తెలిపింది. ప్రస్తుతం 47,968 మంది కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నామని సర్కారు పేర్కొంది. ఇవాళ 1,561 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అవగా.. మొత్తం 46,078 మంది కోవిడ్-19 నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని ప్రభుత్వం వెల్లడించింది.