మధ్యప్రదేశ్ లో పెరిగిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-07-09T03:35:37+05:30 IST

మధ్యప్రదేశ్ లో పెరిగిన కరోనా కేసులు

మధ్యప్రదేశ్ లో పెరిగిన కరోనా కేసులు

భోపాల్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం నాటికి అందిన సమాచారం మేరకు కొత్తగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 409 మందికి కరోనా సోకినట్లు వైద్య అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 16,036 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య శాఖ పేర్కొంది. ప్రస్తుతం 3,420 మంది కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. కరోనా వల్ల ఇవాళ 7 మంది మృతి చెందగా, మొత్తం 629 మంది చనిపోయారు. ఇవాళ కరోనా నుంచి కోలుకున్న 219 మంది బాధితులను డిశ్చార్జ్ చేసినట్లు అధికారులు చెప్పారు. మొత్తం 11,987 మంది కరోనా నుంచి కోలుకున్నారని వైద్య శాఖ వెల్లడించింది.


Updated Date - 2020-07-09T03:35:37+05:30 IST