కరోనా వేళ కేబినెట్ విస్తరణ.. రాజ్‌భవన్‌లో ప్రమాణం

ABN , First Publish Date - 2020-04-21T18:19:58+05:30 IST

భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తన కేబినెట్‌ను విస్తరించారు. రాజ్‌భవన్‌లో

కరోనా వేళ కేబినెట్ విస్తరణ.. రాజ్‌భవన్‌లో ప్రమాణం

భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తన కేబినెట్‌ను విస్తరించారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ లాల్జీ టాండన్ మంత్రులతో ప్రమాణం చేయించారు. ప్రమాణం చేసిన వారిలో నరోత్తమ్ మిశ్రా, కమల్ పటేల్, మీనా సింగ్, తులసి సిలావత్, గోవింద్ సింగ్ రాజ్‌పుత్ ఉన్నారు. 


కరోనా వేళ రాష్ట్రానికి ఆరోగ్యమంత్రి, హోంమంత్రి లేకుండాపోయారనే విమర్శలు వెల్లువెత్తడంతో శివరాజ్ తన కేబినెట్‌ను విస్తరించారు. మార్చి నెల 23న సీఎంగా శివరాజ్ ప్రమాణం చేశారు. నాటినుంచి తానొక్కరే కరోనా కట్టడిపై సమీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు.  

Updated Date - 2020-04-21T18:19:58+05:30 IST