పడవ మునిగి ముగ్గురు పోలీసులు గల్లంతు
ABN , First Publish Date - 2020-04-26T14:43:23+05:30 IST
కరోనా వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు దేశంలో లాక్డౌన్ అమలులో ఉంది. అయితే లాక్డౌన్ విధుల్లో ఉన్న ముగ్గురు పోలీసులు ప్రయాణిస్తున్న పడవ...

ఫతేపూర్: కరోనా వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు దేశంలో లాక్డౌన్ అమలులో ఉంది. అయితే లాక్డౌన్ విధుల్లో ఉన్న ముగ్గురు పోలీసులు ప్రయాణిస్తున్న పడవ మునగడంతో వారు నదిలో పడి గల్లంతయ్యారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్లోని ఫతేపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. గల్లంతయిన పోలీసుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. బలమైన గాలులు, వర్షం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. ఈ సంఘటన కిషన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సంగోలిపూర్ మడైయన్ ఘాట్ వద్ద యమునా నదిని దాటుతున్నప్పుడు పడవ బోల్తా పడింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసు బృందం ఘాట్ వద్దకు చేరుకుని సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది.