లాక్డౌన్తో ఆహారకొరత ఉండదు: ఎఫ్సీఐ
ABN , First Publish Date - 2020-03-25T07:59:38+05:30 IST
దేశంలో లాక్డౌన్ దీర్ఘకాలమున్నా ఆహార ధాన్యాల కొరత ఉండదని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్సీఐ) చైర్మన్ డీవీ ప్రసాద్ స్పష్టంచేశారు.

న్యూఢిల్లీ, మార్చి 24: దేశంలో లాక్డౌన్ దీర్ఘకాలమున్నా ఆహార ధాన్యాల కొరత ఉండదని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్సీఐ) చైర్మన్ డీవీ ప్రసాద్ స్పష్టంచేశారు. పేదలకు అందించేందుకు భారత్లో ఏడాదిన్నర వరకు సరిపడా ఆహారధాన్యాల నిల్వలు ఉంటాయని, ఈ సారి రికార్డు స్థాయిలో వాటి ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు. బియ్యం, గోధుమల గురించి ఎటువంటి ఆందోళన అవసరం లేదని వివరించారు.