తమిళనాడులో లాక్డౌన్ సమయం కుదింపు
ABN , First Publish Date - 2020-04-05T21:32:02+05:30 IST
తమిళనాడులో రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోవడంతో పళని స్వామి నేతృత్వంలోని సర్కార్ అప్రమత్తమైంది. లాక్డౌన్ వెసులుబాటు సమయాన్ని
చెన్నై : తమిళనాడులో రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోవడంతో పళని స్వామి నేతృత్వంలోని సర్కార్ అప్రమత్తమైంది. లాక్డౌన్ వెసులుబాటు సమయాన్ని తగ్గించింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే ప్రజలు బయటికి వచ్చి తమ నిత్యావసరాలను కొనుగోలు చేసుకోవాలని ప్రభుత్వం నూతన ఆంక్షలు విధించింది. ఇప్పటికే 485 మందికి కోరోనా పాజిటివ్ రావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. మరోవైపు ఓ వర్గాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడటంపై ముఖ్యమంత్రి పళని స్వామి స్పందించారు. అలాంటి ప్రచారాన్ని వెంటనే ఆపేయాలని విజ్ఞప్తి చేశారు. వైరస్ అనేది ఎవర్నైనా ఇబ్బంది పెడుతుందని, దానికి కులం, మతం లేదని తెలిపారు. సమాజంలోని ప్రజలందర్నీ గౌరవించాలని పళని స్వామి సూచించారు.