నేడు చైనాతో లెఫ్టినెంట్ జనరల్ చర్చలు!
ABN , First Publish Date - 2020-06-06T07:29:53+05:30 IST
సుమారు నెల రోజులుగా తూర్పు లదాఖ్లోని నియంత్రణ రేఖ వెంబడి భారత్, చైనాల మధ్య నలుగుతున్న
న్యూఢిల్లీ/బీజింగ్, జూన్ 5: సుమారు నెల రోజులుగా తూర్పు లదాఖ్లోని నియంత్రణ రేఖ వెంబడి భారత్, చైనాల మధ్య నలుగుతున్న సరిహద్దు వివాదం పరిష్కారం దిశగా ఎట్టకేలకు ఒక అడుగు ముందుకు పడింది. ఇరు దేశాలకు చెందిన లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారులు శనివారం సమావేశమై ఈ అంశంపై చర్చించనున్నారు. తూర్పు లద్దాఖ్లోని చుషూల్ సెక్టార్లో మాల్డో వద్ద ఉదయం 8గంటలకు చర్చలు జరగనున్నాయి.